సంప్రదాయాలకు తెలుగు వారు పెట్టింది పేరు.అలా తెలుగు లోగిళ్లలో ఏ చిన్న ఉత్సవం చేసుకున్నా సరే… సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడం మనలో చాలా మందిమి చూసే ఉంటాం.
ఇక పెళ్లిళ్లలో అయితే ఈ సంప్రదాయాలకు కొదువే ఉండదు.తమ వద్ద కానుకలు ఇచ్చేంత స్థోమత లేకున్నా సరే పలువురు అప్పు చేసి మరీ కానుకలు పంపిస్తుంటారు.
అత్తింటి వాళ్ల ముందు తమ వాళ్లు తల దించుకునే పరిస్థితి రాకుండా ఉండాలని ఇలా చేస్తుంటారు.ఇలా ఓ అత్తింటి వారు తమ అల్లుడికి సారెగా భారీ కానుకలు పంపించారు.
ఈ కానుకలను చూసిన అత్తింటి వారు నోరెళ్లబెట్టారు.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే….
ఏపీలోని రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్న వ్యక్తి తన అల్లుడికి ప్రేమతో ఇలా భారీ కానుకలు పంపించాడు.ఎంతలా అంటే ఇంతవరకు ఎవరూ కనీ, వినీ ఎరుగని రీతిలో పంపించాడు.
వెయ్యి కిలోల చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది.ఈ సారెను చూసిన అల్లుడితో పాటు వాళ్ల ఇంటి వారు కూడా అవాక్కయ్యారు.
ఇలా సారెతో రికార్డులు క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగే ఉంటుంది.
రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామ కృష్ణ కుమార్తె ప్రత్యూష ను ఇటీవల యానాం కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు.ఆషాఢం నేపథ్యంలో పెళ్లి కుమార్తె తండ్రి తన అల్లుడి ఇంటికి ఆషాఢం సారె ను కళ్లు దిమ్మతిరిగే రేంజ్ లో పంపించాడు.మరో విషయం ఏంటంటే యానాం వచ్చిన ఈ ఆషాడం కావిళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చారు.
స్థానికులు వాటిని నోరెళ్లబెట్టారు.