కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కరోనా వ్యాక్సిన్ ముందుగా తమకు కూడా ఇవ్వాలని వివిద సంస్థలు వైధ్య ఆరోగ్య శాఖకు వినతి పత్రాలను అందజేస్తున్నారు.ప్రైవేట్ పరిశ్రమలు, తదితర చోట్ల పనిచేసే వైధ్యులు, క్లినిక్ లు, న్యాయ వాదులు, ఉపాధ్యాయులు, ఆర్ఎంపి లు, పిఎంపి లు ముందుగా మాకు కూడా వ్యాక్సిన్ కోరుతున్నాయి.వైధ్య ఆరోగ్య శాఖ ఇప్పటికే 2.90 కోట్ల టీకాలను సేకరించింది.ముందుగా వాటిని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది.ఆ సమాచారని కోవిన్ యాప్ లో పొందు పరిచింది.వైధ్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీస్టులు ఈ జాబితాలో ఉన్నారు.రాష్ట్రంలో 40 వేల మంది ఆర్ఎంపి లు పిఎంపి లు ఉన్నారు కోవిడ్ బారిన పడి 40 మంది మృతి చెందారు.
తమకు కూడా తొలి దశలో టీకాలు వెయ్యాలను వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రజా ఆరోగ్య సంచలకులు డాక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాని అందజేశారు.భారీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సొంతంగా నర్సులను, వైధ్యులను నియమించుకుంటారు వారు కూడా మాకు తొలి దశలోనే టీకాను అందించాలని వైధ్య ఆరోగ్యశాఖకు వినతి పత్రాని అందజేశారు.
వీరి యొక్క ఇన్ఫర్మేషన్ ను ప్రత్యేకమైన కోవిడ్ యాప్ పొందుపరచాలని డిఎంహెచ్ఓ లని ఆదేశించింది.