యంగ్ హీరో నితిన్ ఇటీవల నటించిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న నితిన్, ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడ్డాడు.
ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రంగ్దే అనే టైటిల్ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో రంగ్దే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, జీ5 ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ను ఇచ్చాయట.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్ చివరి వారం నుండి తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను ముగించుకుని రిలీజ్కు రెడీ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.భీష్మ చిత్రంతో అందుకున్న సక్సెస్ను నితిన్ కంటిన్యూ చేస్తాడా లేడా అనేది ఈ సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది.