కరోనా కోసం ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందా అని అందరూ భయంతో బ్రతుకుతున్నారు.ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు అందరూ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Huge Demand For Corona Fish At Mangalore Port-TeluguStop.com

కాగా పలు రాష్ట్రాలు, దేశాలు ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.అయితే ఒక చోట మాత్రం మాకు కరోనా కావాలి అంటూ జనం క్యూ కడుతున్నారు.

కరోనా కోసం క్యూ కట్టడం ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ జనం క్యూ కడుతోంది కరోనా అనే చేపల కోసం.సముద్రంలో లభించే అరుదైన కరోనా చేపలు ప్రస్తుతం మంగళూరు పోర్టులో హల్‌చల్ చేస్తున్నాయి.

దీంతో అక్కడి జనం ఈ చేపలను కొనేందుకు మార్కెట్‌కు బారులు తీరుతున్నారు.వేల రూపాయలను వెచ్చించి మరీ ఈ కరోనాను కొనుగోలు చేస్తున్నారు.

‘మెలనోటినియా కరోనా’గా పిలవబడే ఈ చేపలు తించే ఆరోగ్యానికి చాలా మంచిదని వారు ఈ విధంగా పరుగులు తీస్తున్నారు.

మంగళూరు, ఉడిపి వంటి ప్రాంతాల్లో కరోనా చేపల కోసం జనం ఎగబడుతుండటంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube