విచారణకు ఏ1 గా హాజరు అయిన రేవంత్‌ రెడ్డి

2015 సంవత్సరం నుండి ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నాయకుడు ఎంపీ రేవంత్‌ రెడ్డి విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు.ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నాడు.

 Httpstelugustop Comwp Contentuploads202003revanth Reddy Attend The Court Jpg-TeluguStop.com

ఒక ఎమ్మెల్సీని డబ్బులతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు అంటూ రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.ఆ విషయమై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

వీడియోలు మరియు పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా విచారణ పేరుతో సాగతీస్తూనే ఉన్నారు.ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి విచారణ నిమిత్తం తాజాగా కోర్టుకు హాజరు అయ్యాడు.

కేసుకు సంబంధించి ప్రభుత్వం మరియు రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు.ఇటీవల కేసులో కీలక విచారణ కారణంగా రేవంత్‌ రెడ్డిని హాజరు అవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

అందుకే తాజాగా కోర్టుకు రేవంత్‌ రెడ్డి హాజరు అయ్యాడు.తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి చివరకు ఇలా బుక్‌ అయిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube