సినిమా ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలియాలంటే ఆ షూటింగ్లను దగ్గరగా మనసు పెట్టి చూస్తే మాత్రమే అర్ధం అవుతుంది.ఇంతలా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని నిర్మించే చిత్రం వివాదాల్లో చిక్కుకుంటే జరిగే నష్టం ఏంతో మాటల్లో చెప్పలేం.
కాని ఆ చిత్రాన్ని నిర్మించిన బృందానికి మాత్రం యమ టెన్షన్గా ఉంటుంది.
ఇదిగో ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుకుంది.
తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమాలోంచి తొలగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఫిర్యాదు చేశాయి.
అంతే కాకుండా రిలీజ్కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని స్వర్ణ కార సంఘాలు హెచ్చరించాయట.
ఇకపోతే గిరి పి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై, అల్లరి నరేష్, పూజా జవేరీ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపధ్యంలో ఇలాంటి వివాదం తెరపైకి రావడంతో చిత్రయూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుందట.