ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోల మల్టీస్టారర్ చిత్రాలకు నేషనల్ వైడ్ గా మార్కెట్ పెరుగుతోంది.ఇద్దరు అగ్ర హీరోలు ఎవరైనా సరే ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసేస్తారు.
తెలుగులో రాజమౌళి, తారక్ – చరణ్ లతో RRR సెట్ చేయగానే ఇతర స్టార్ డైరెక్టర్స్ కూడా మల్టీస్టారర్ కథలను రెడీ చేసే పనిలో పడ్డారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కూడా గత కొంత కాలంగా స్టార్ హీరోలతో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది.హృతిక్ ధనుష్ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.అయితే ఆ విషయంపై హృతిక్ రోషన్ ఓ క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల రిలీజైన సూపర్ 30 మూవీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రెస్ మీట్ లో మల్టీస్టారర్ గురించి ఓ ప్రశ్న ఎదురవ్వగా హృతిక్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
ఇంకా తన వద్దకు ఏ దర్శకుడు రాలేదని ఆనంద్ ఎల్ రాయ్ ఎలాంటి కథను సెట్ చేసుకున్నారో కూడా తెలియదని అన్నాడు.ఇక మల్టీస్టారర్ లో నటించడానికి నేనెప్పుడు ముందుంటాను అంటూ దర్శకుడు హీరో ఎవరైనా సరే కథ నచ్చితే మల్టీస్టారర్ కథకు ఒప్పుకుంటాను అని హృతిక్ రోషన్ వివరణ ఇచ్చాడు.