బాలీవుడ్ రాకుమారుడు, సూపర్ హీరో హృతిక్ రోషన్ కి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది.ఓ విధంగా చెప్పాలంటే హాలీవుడ్ హీరోల స్థాయిలో అతనికి ఇతర దేశాలలో కూడా ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపధ్యంలో అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి హృతిక్ రోషన్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది.
హృతిక్తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఈ అకాడమీ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూసే అత్యంత పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల వేడుక.
జీవితంలో ఒకసారైన ఆస్కార్ అవార్డు అందుకోవాలని హాలీవుడ్ నటులు కలలు కంటూ ఉంటారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల వేడుక ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.
వచ్చే యేడాదిలో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేశారు.ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరపబోతున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది.
ఆస్కార్ వేడుకల చరిత్రలో ఈ వేడుక వాయిదా వేయడం నాల్గోసారి జరిగింది.ఇక ఈ అవార్డుల వేడుకలలో భారత్ నుంచి హృతిక్ రోషన్ కి ప్రత్యేక ఆహ్వానం లభించింది.
తమ అభిమాన నటుడుకి ఇలా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందడంపై సోషల్ మీడియాలో హృతిక్ అభిమానులు విపరీతంగా పోస్టులు చేస్తున్నారు.