డబ్బు సంపాదించడం ఈజీనే కాని దాన్ని మెయింటెన్ చేయడం కష్టం అంటూ ఒక సినిమాలో డైలాగ్ ఉంది.కాస్త ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది.
ఎక్కువ శాతం మంది మగాళ్లు తాము పెళ్లి చేసుకోక ముందు 10 వేల రూపాయల జీతం వచ్చింది.అప్పుడు చాలా డబ్బు మిగిలేది.
పెళ్లి అయిన తర్వాత 20 వేల జీతం వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగానే జీవితం సాగింది.అంతో ఇంతో మిగిలేది.
ఇప్పుడు 40 వేలు వచ్చినా కూడా నెలాకరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటూ ఉంటారు.ఈ పరిస్థితి చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు.
తక్కువ జీతం వచ్చిన సమయంలో అదే పరిస్థితి ఎక్కువ జీతం వచ్చిన సమయంలో అదే పరిస్థితి అంటూ చాలా మంది అంటూ ఉండగా నేను విన్నాను.అలాంటి వారు కాస్త లోతుగా ఆలోచిస్తే ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం వారికే అర్థం అవుతుంది.డబ్బులు ఉంటే ఖర్చులు వాటంతట అవే పుట్టుకు వస్తాయి.ఇది జగమెరిగిన సత్యం.డబ్బులు చేతిలో వంద రూపాయలు ఉంటే ఒక సాదారణ హోటల్కు వెళ్లి టిఫిన్ చేసి 50 రూపాయలు మిగుల్చుకుందాం అనుకుంటారు.అదే జేబులో వెయ్యి రూపాయలు ఉంటే బిర్యానీ తిన్నా కూడా ఇంకా అయిదు వందలు ఉంటాయి కనుక పర్వాలేదు అన్నట్లుగా ఆలోచిస్తారు.
ఇలాంటివి ఎన్నో ఖర్చులు చేస్తారు.
కనిపించని ఖర్చులు చాలా చేస్తూ ఉంటారు.ఆదాయం పెరిగిన సమయంలో ఆ ఖర్చులు కూడా పెరుగుతాయి.అందుకే డబ్బులు ఎంతో కొంత సేవ్ చేయాలనుకున్నప్పుడు ఈ అయిదు పనులు చేయాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
వచ్చేది ఎంత అయినా సరే అందులో కనీసం 25 శాతం వరకు సేవింగ్స్కు ఉపయోగించాలి.పెట్టే ఖర్చుల విషయంలో కాస్త ఆలోచన ఉండాలి.అంటే ఇది అవసరమా లేదా అని ఆలోచించాలి.గతంతో పోల్చితే ఇప్పుడు ఏ విషయంలో ఖర్చు పెరిగిందో గమనించి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.డబ్బులు జేబులో ఉంటే ఖర్చులు ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి, అవసరాలు క్రియేట్ అవుతాయి.అందుకే జేబులో డబ్బులు తక్కువ మెయింటెన్ చేయాలి.
ప్రతి రోజు చేసే అనవసర ఖర్చును రాత్రి సమయంలో లెక్క వేసుకుంటే తర్వాత రోజు ఆ అనవసర ఖర్చు అయ్యే ఛాన్స్ తక్కువ.