డీ మార్ట్ అంటే తెలియని సగటు మధ్య తరగతి ప్రజలు ఉండరనే చెప్పవచ్చు.ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో నివసించే వారికి డీ మార్ట్ అనేది అత్యంత సుపరిచితం.
అయితే డీ మార్ట్ అనేది మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు నిత్యవసర సామాగ్రి దొరకడంతో సామాన్యులకు డీ మార్ట్ ఎంతో దగ్గరైంది.అయితే డీ మార్ట్ కు సంబంధించి ఎవరికీ అంతగా ఏ విషయం కూడా బయటికి తెలియదు.
అంతర్జాతీయ వ్యాపార విశేషాలు, కార్పొరేట్ వ్యవహారాలను ఎక్కువగా అనుసరించే వారికి ఈ డీమార్ట్ గురించి కొన్ని వార్తలు తెలుస్తాయి.అయితే డీ మార్ట్ ను రాధాకృష్ణ దమానీ స్థాపించాడు.
ప్రస్తుతం డీ మార్ట్ ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటిగా దూసుకుపోతోంది.అయితే ఇప్పుడు డీ మార్ట్ ఓనర్ రాధాకృష్ణ దమానీ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.
అయితే దమానీ 1000 కోట్ల రూపాయలతో ఓ ఇల్లును కొనుగోలు చేసాడని సమాచారం.ముంబైలోని సంపన్న ప్రాంతాలలో ఒకటైన మలబార్ హిల్ లో తన సోదరుడు గొపీ కిషన్ దమానీతో కలసి ఈ ఇంటిని కొనుగోలు చేశాడు.థానేలోని మొండెలెజ్ ఇండియాకు చెందిన 8 ఎకరాల భూమిని కూడా దాదాపు రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.