జూన్ 18 నుండి ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ లో ఉన్న ఏజిస్ బౌల్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే నిబంధనలు అన్నీ కూడా ఐసీసీ ఇప్పటికే ప్రకటించారు కూడా.
తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించి మరో సరికొత్త అప్డేట్ వచ్చింది.అదేమిటి అంటే ఈ మ్యాచ్ లో సాధించిన విజేతలకు, రన్నరప్ కు ప్రైజ్ మనీ ఎంత అనే విషయాన్ని ఐసిసి తెలియచేసింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన వారికి 1.6 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీ గా అందచేయబోతున్నట్లు, అలాగే 8 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా అందచేయబోతున్నట్లు ఐసిసి తెలిపింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో జియాఫ్ అల్లార్డైస్ తెలియచేశారు.
అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
ఇలా ఉండగా ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లిస్టులో భారత జట్టు 17 మ్యాచ్లో పగలు 12 మ్యాచులు విజయం సాధించి మొదటి స్థానంలో నిలవగా., న్యూజిలాండ్ 7 మ్యాచ్ లను గెలుచుకొని రెండో స్థానంలో నిలబడింది.ఇక ఈ తరుణంలోనే న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య జూన్ 18 న ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతోంది ఐసీసీ.
ఈ మ్యాచ్ ఒకవేళ డ్రాగా ముగిస్తే ఆ ప్రైజ్ మనీని మొత్తంగా విభజించి రెండు జట్లకు అందచేయబోతున్నట్లు సమాచారం.