తెలుగు బుల్లితెరలో ప్రసారం అవుతున్న ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే గత ఆదివారం రోజున నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ గా బిగ్ బాస్ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందనే చెప్పాలి.
నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా బిగ్ బాస్ షో కి విచ్చేసారు.వారు చేసిన సందడితో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు, బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందారు.
అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో కి ఒక స్పెషల్ గెస్ట్ గా హైపర్ ఆది కూడా వచ్చాడు రావడం రావడంతోనే తన పంచ్ లతో షో అంతా ఒక్కసారిగా నవ్వులమయం చేసేసాడు.పోలీస్ గెటప్ లో వచ్చిన హైపర్ ఆది ఎప్పటిలాగే తన కామెడీ మార్క్ చూపించాడు.
హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నది అరగంటే అయినా అందరిని తన కామెడీతో అలరించాడు.
కాగా ఈ ఆర గంట సమయానికి హైపర్ ఆదికి రెమ్యూనరేషన్ భారీగానే ముట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం ఆది బిగ్బాస్ స్టైజ్ మీద అర గంట ఎంటర్టైన్ చేసినందుకుగానూ ఏకంగా రెండున్నర లక్షల రూపాయిలను పారితోషకంగా అందుకున్నట్లు తెలుస్తుంది.ఒక్క అరగంటకే హైపర్ ఆది అంతా రెమ్యునిరేషన్ తీసుకున్నడంటేనే అర్ధం అవ్వడం లేదా హైపర్ ఆది క్రేజ్ ఏంటో.హైపర్ ఆది అతి తక్కువ సమయంలోనే ఇంత పాపులారిటీ సంపాదించాడంటే మాములు విషయం కాదు కదా.