స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ చాలా బిజీ బిజీగా మారిపోయింది.
పెళ్లి తర్వాత నుంచి ఇప్పటివరకు భర్తతోనే ఎడతెరిపి లేకుండా ఎంజాయ్ చేస్తోంది.అంతేకాదు ఈ అమ్మడు రోజుకొక ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఇంత బిజీలో కూడా ప్రస్తుతం ఆవిడ ప్రమోషన్స్ కూడా చేస్తోంది
ప్రస్తుతం భర్తతో కలిసి మాల్దీవ్స్ లోనే ఆవిడ ఎంజాయ్ చేస్తోంది.గత వారం రోజుల నుంచి వారు అక్కడే హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి రోజుకో ఫోటో షూట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.ఇందులో భాగంగానే ఆవిడ బీచ్ దగ్గర భర్తతో కలిసి ఉన్న ఫోటోలు అలాగేవివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను ఆవిడ తన ద్వారా అభిమానులకు తో షేర్ చేస్తూనే ఉంది
ఇకపోతే ఈ హనీమూన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది అని ఆ ఫోటోలు చూస్తుంటే బాగా అర్థమవుతుంది.
నిజానికి మాల్దీవ్స్ బాగా కాస్ట్లీ ఏరియా.అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునేవారు బాగా ధనవంతులు లేకపోతే బాగా ట్రిప్స్ వెళ్లే వారు ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారు.
అంతేకాదు పెళ్లయిన కొత్త జంటకు కూడా ఇది మంచి స్పాట్.సుందరమైన సముద్ర బీచ్ లు, ఇసుక తిన్నెలు అతి దగ్గరగా కనిపించే విధంగా చంద్రుడు కనిపించడం ఇలా ఎన్నో విషయాలు అక్కడ కనిపిస్తాయి.
ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ తన హనీమూన్ కోసం ఖర్చు చేసిన లెక్కలు కూడా బయటకు వస్తున్నాయి.ఇకపోతే వారి హనీమూన్ కోసం ఏకంగా 40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
స్టార్ హీరోయిన్ కదా ఆ రేంజ్ ఉంటుంది మరి.ఇకపోతే ఆవిడ హనీమూన్ నుండి తిరిగి వచ్చాక మోసగాళ్ళు, ఆచార్య సినిమాల్లో నటించనుంది.మరోవైపు తమిళ్ లో భారతీయుడు2, పారిస్ పారిస్ సినిమాలలో కూడా ఆవిడ నటిస్తుంది.