కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద తీవ్రంగా పడింది.అన్ని రంగాలలో కంటే ఎక్కువగా ఫోకస్ అయ్యే రంగం సినిమా రంగం.
ఒక పెద్ద సినిమా కొన్ని వేల థియేటర్ లలో విడుదలవుతుంది.కొన్ని కోట్ల వ్యాపారాలు జరుగుతాయి.
కొన్ని వేల సినిమా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా థియేటర్ లు మూతపడ్డ విషయం తెలిసిందే.
దీంతో కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు చిత్రీకరించిన సినిమాలు సినిమా థియేటర్ లు మూసివేత ఉండటంతో ఇప్పట్లో థియేటర్ లు తెరిచే అవకాశం కూడా లేకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక అన్ని సినిమాలు ఇక ఓటీటీ బాట పట్టాయి.
ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన సినిమా రాధే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే జీ ఫ్లెక్స్ లో విడుదలైన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్ ఖాన్ 80 కోట్ల రూపాయలతో నిర్మించాడు.జీ ఫ్లెక్స్ కు రాధా చిత్రాన్ని 190 కోట్లకు అమ్మారు.
ఈ లెక్కన చూస్తే 110 కోట్లు అదనంగా వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం.ఏది ఏమైనా సల్మాన్ రేంజ్ కు 110 కోట్ల లాభం అంటే చాలా తక్కువ అనే చెప్పాలి.