టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న వారిలో పూజా హెగ్డే ఒకరు.ఈమె తెలుగు తమిళ చిత్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే రాజమౌళి సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమా గురించి మనకు తెలిసిందే.ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పూజా హెగ్డే రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో సూపర్ లుక్ లో కనిపిస్తున్నారని ఇద్దరిని కలిపి బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నానని ఈమె తెలిపారు.
ఇక పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా కూడా ఫిబ్రవరి 4వ తేదీ విడుదల కానుంది.ఇక రాజమౌళి సినిమా నుంచి ఒక్కొక్క పోస్టర్ పాటను విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ క్రమంలోనే సాధారణ ప్రేక్షకులు అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం రాజమౌళి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ.