రెవెన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది.ఎందుకంటే భూముల విషయంలో వారు చాలా గోల్ మాల్ చేస్తారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఇప్పటికే ఎంతోమంది రెవెన్యూ ఆఫీసర్లు సాగించిన భూ అక్రమాలను మనం చూశాం.కానీ ఇప్పుడు అంతకు మించిన భూ స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం.
అయితే ఇంత పెద్ద స్కామ్ చేసింది ఎవరో పెద్ద ఆఫీసర్ అనుకుంటే పొరపాటు ఒక వీఆర్వే.ఆయన ప్రభుత్వానికి చెందిన భూమిని ఏకంగా 2320 ఎకరాలను గోల్ మాల్ చేసేశారు.
ఈ భూమిని మొత్తం తన పిల్లలకు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేసేశారు.
చిత్తూరు జిల్లాలో ఆయన రీసెంట్ గా ఒకేరోజు 1,577 ఎకరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో అంతా షాక్ అయిపోయారు.ఈ భూమి విలువ దాదాపుగా రూ.500 కోట్ల దాకా ఉంటుందని చెబుతున్నారు.దీంతో ఈ ఉదంతం ఇప్పుడు ఏపీలో ప్రకపంనలు రేపుతోంది.ఇదే జిల్లాలో నివసం ఉండే మోహన్ గణేశ్ పిళ్లై గతంలో వీఆర్వోగా పని చేసిన క్రమంలోనే ఈ భూమికి ఎన్నో రకాల నకిలీ పత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది.
అయితే ఆయన 2010లో రిటైర్ అయిపోయారు.ఇక జిల్లాలోని పలు వరుస గ్రామాల్లో అటవీ భూములకు దగ్గరగా ఉండే ప్రభుత్వ భూమి అయిన 2320 ఎకరాలను ఆయన కొట్టేసేందుకు ప్లాన్ వేశారు.
ఈ భూమి మొత్తం తన తండ్రికి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని, కాబట్టి అది తమకే దక్కుతుందంటూ కొన్ని నకిలీ పత్రాల్ని క్రియేట్ చేసేశాడు.ఇదంతా ఆయన వీఆర్వోగా పనిచేసనిప్పుడే ఈ అరాచకాలను చేశాడు.ఇక ఆ భూమిని తన అమ్మ, కొడుకుల పేరుమీద గతంలోనే ఆన్లైన్లో నమోదు చేయించి అందులో కొంత భూమిని పదిమందికి అమ్మేశాడు.అయితే ఇందులో ఒకరు 160 ఎకరాలకు పట్టా కావాలంటూ దరణి దరఖాస్తు చేసుకోగా ఇందులోని లోతులను గమనించిన తహసీల్దార్ విచారణకు ఆదేశించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక వారు 2020 మే నెల నుంచి విచారణ జరుపుతుండగా ఇప్పుడు ఈ భూ దందా బయటకు వచ్చేసింది.