ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరేదీ ఉండదేమో కదా.ఎందుకంటే తల్లి మాత్రమే ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమను పంచుతుంది.
కన్న బిడ్డకు ఆపద వచ్చిందంటే చాలు తన ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడుకుంటుంది.బిడ్డకు ఆకలేస్తే తన కడుపు మాడ్చుకుని అయినా ఉన్నది కాస్తా బిడ్డకు పెట్టేస్తుంది.
అయితే అలాంటి త్యాగాలు చేస్తున్న తల్లిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి కొందరు కన్న బిడ్డలే చేస్తున్న పనులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చూస్తున్నాం. తల్లిని చిత్ర హింసలు పెడుతన్న ఘటనలు కూడా చూస్తున్నాం.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన మాత్రం మానవాళికే సిగ్గుచేటు లాంటిది.అత్యంత హేయమైన ఘటనకు పాల్పడ్డాడు ఓ కొడుకు.తన తల్లి తన వద్ద కాకుండా తమ్ముడి దగ్గరే ఉంటుందనే నెపంతో చేయకూడని తప్పు చేసేశాడు.దీంతో అతగాడుచేసిన పనికి స్థానికులు, బంధువు తీవ్ర స్థాయిలో మండిపడటంతో ఈ ఉదంతం కాస్త వెలుగులోకి వచ్చింది.
నకిరేకల్ ప్రాంతానికి చెందినటువంటి పోషమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు.అయితే తల్లి చిన్న కొడుకు దగ్గరే ఉంటుందన్న కోపంతో పెద్ద కొడుకు లైన్ దాటేశాడు.
తన తల్లి ఈ నెల 19వ తారీఖున చనిపోయిందని, కాబట్టి ఆమెకు అక్టోబరు 28వ తారీఖున పెద్ద కర్మను చేస్తున్నట్టు కార్డులు కొట్టిచ్చి ఊరంతా పంచేశాడు.అంతే కాదు తన కు తెలిసిన వారికి అలాగే బంధువులకు కూడా ఈ కార్డులను అందజేసి రావాలంటూ ఆమ్వానించాడు.అయితే అతని తీరుపై అంతా మండిపడ్డారు.బతికున్న తల్లిని ఇలా చేయడమేంటంటూ అంతా ఆవేశం కనబరిచారు.ఇక దీనిపై తల్లి పోషమ్మ చాలా బాధపడింది.వెంటనే కొడుకు నిర్వాకంపై పోలీసులకు కంప్లయింట్ కూడా అందజేసింది.
వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.