ఏపీలో అధికారం పంచుకుంటున్న టీడీపీ -బీజేపీ ప్రతి రోజు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీల నాయకుల మధ్య గొడవలు ముదురుతున్నాయి కానీ తగ్గడం లేదు.
ఒకరు ఒకటంటే మరొకరు రెండు అంటున్నారు.మొన్న టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న బీజేపీ నాయకులు పురదేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, కావూరి సాంబశివ రావు మీద ఆరోపణలు చేశారు.
వెంటనే కాషాయ పార్టీ నాయకులు వెంకన్న మీద విరుచుకు పడ్డారు.దీంతో మంత్రి రావెల కిషోర్ బాబు రంగంలోకి దిగి మాటల దాడి చేశారు.
ఈయన కన్నా లక్ష్మీ నారాయణ మీద అటాక్ చేశారు.ఆయన గత చరిత్ర తవ్వారు.
కన్నా అసలు ఎవరో తెలియ చేశారు.కన్నా తండ్రి సైకిల్ షెడ్డు నడుకునే వాడట.
ఒక సైకిల్ షెడ్డు యజమాని కుమారుడైన కన్నా లక్ష్మీ నారాయణ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని మంత్రి రావెల ప్రశ్నించారు.అంటే అవినీతి, అక్రమాలు చేసి సంపాదించాడని అర్థం.
బీజేపీ నాయకులు టీడీపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు.టీడీపీ భవిష్యత్తులో సింగిల్ పార్టీగా ఉంటుందని రావెల చెప్పారు.
అంటే బీజేపీతో పొత్తు ఉండదని చెప్పడమే కదా.రెండు పార్టీల నాయకులు కొట్టుకుంటున్నా చంద్ర బాబు మాత్రం గమ్మున ఉంటున్నారు.