తెలుగు సినీ నటుడు మెగా హీరో నాగబాబు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.వెండి తెరపై కాకుండా బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఈ మధ్య తన ఛానెల్ ద్వారా పలు సిరీస్ లో కూడా చేస్తున్నాడు.
ఇక ఆయన తాజాగా కరోనా థర్డ్ వేవ్ పై హాట్ కామెంట్స్ చేశాడు.
గత ఏడాది నుండి కరోనా దేశాన్ని పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ వేవ్ కరోనా ఎంతో మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది.అలా దాని తీవ్రత ఎంతో పెరిగి తగ్గుముఖం పట్టినట్లు పట్టగా మళ్లీ ఈ ఏడాది సెకండ్ వేవ్ తో మరింత దారుణంగా వణికించింది.
ఈ ఏడాది కూడా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిశాయి.ఇక త్వరలోనే థర్డ్ వేవ్ ఉంటుందని దీని తీవ్రత మరింత ఘోరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నాగబాబు థర్డ్ వేవ్ గురించి స్పందిస్తూ.ఇంతకు ముందైతే భారత్ కరోనా మూడో వేవ్ ను అడ్డుకోగలదనే నమ్మకం ఉండేదని తెలిపాడు.
ప్రస్తుతం ప్రభుత్వం కూడా కన్వర్ యాత్ర కి అనుమతి ఇవ్వడంతో కరోనా థర్డ్ వేవ్ తో ప్రమాదం ఉందని అన్నారు.ఇప్పుడు భారత్ కు రెండే దారులు ఉన్నాయంటూ.అందులో ఒకటి కన్వర్ యాత్రని ఆపడం లేదా కరోనా థర్డ్ వేవ్ ను ఆహ్వానించడమే అంటూ గట్టిగా స్పందించాడు.
నిజానికి కరోనా ప్రజలకు వ్యాపించడం అంత కష్టమేమీ కాదు.
ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిగా వ్యాపిస్తుంది.
దీంతో ఈ సమయంలో ఒకరినొకరు తగలకుండా, మూతికి మాస్క్ లను ధరించడం వల్ల కొంతవరకు వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు.ఇప్పటికే ప్రభుత్వం పలు జాగ్రత్తలతో కొన్ని నిబంధనలు కేటాయించగా.మళ్లీ ఆ ప్రభుత్వమే యాత్రలకు అవకాశం ఇవ్వడంతో మళ్లీ వైరస్ వ్యాప్తి ఉండదన్న గ్యారెంటీ అసలు ఉండదు అని అర్థమవుతుంది.
ఇక ఈ విషయం పట్ల సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు.