సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సరైన ఐటెం సాంగ్ పడి చాలా కాలం అవుతుంది.దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడుతున్నారు.
అయితే మళ్ళీ ఇన్ని రోజులకు మహేష్ సినిమాలో కుమ్మేసే ఐటెం సాంగ్ ను తీసుకు రాబోతున్నారు అని తెలుస్తుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఐటెం సాంగ్స్ చూపించి చాలా రోజులే అవుతుంది.
ఈయన చివరిసారిగా అత్తారింటికి దారేది సినిమాలో ఐటెం సాంగ్ చూపించాడు.అందుకే ఈసారి ఇద్దరు కూడా స్పెషల్ గా చేయాలని అలోచించి ఐటెం నెంబర్ ను తీసుకు రావాలని అనుకుంటున్నారట.
ఈ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ను కూడా దింపే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు గత కొన్ని రోజుల క్రితం నుండే వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరు అనే దానిపై ఒక అప్డేట్ వచ్చింది.
మరి ఈ సినిమాలో ఆడిపాడే లక్కీ ఛాన్స్ ను బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా అందుకోబోతున్నట్టు టాక్.త్రివిక్రమ్ ఊర్వశి రౌటేలా ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.ఇదే నిజమైతే మహేష్ బాబుతో ఊర్వశి రౌటేలా స్టెప్పులేస్తే థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయం.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం ఇప్పుడు రెడీ అవుతుంది.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.