ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన మహా కుంభమేళా (Kumbh Mela)ఉత్తరప్రదేశ్లోని గంగా, యమునా, సరస్వతీ(Ganga, Yamuna, Saraswati) నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది.చలి చంపేస్తున్నా లెక్కచేయకుండా మొదటి రోజునే 40 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ ఏడాది జరిగే ఈ మహా యజ్ఞానికి 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.దీంతో ఇది చరిత్రలో నిలిచిపోయే మహాసమ్మేళనంగా మారనుంది.
అయితే ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది.మేళా ప్రాంగణంలో ఓ సాధువు తన టెంటులో కూర్చొని ఉండగా ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.యూట్యూబర్(YouTuber) అడిగిన ప్రశ్నలకు కోపగించిన సదరు సాధువు ఆగ్రహంతో ఊగిపోతూ ఇనుప కడ్డీలతో అతడిని కొట్టి టెంటు నుంచి బయటకు గెంటేశాడు.
సాధువు అక్కడున్న వాళ్లని చూసి “అతడేం తప్పుగా మాట్లాడాడో విన్నారా?” అని చాలా కోపంతో అడిగాడు.
“జనతా దర్బార్” (Janata Darbar)అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 కోట్ల వ్యూస్(20 crore views), వేలల్లో కామెంట్లు వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు నవ్వుతూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు యూట్యూబర్ దే తప్పా లేక సాధువుదే తప్పా అని వాదిస్తున్నారు.
ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేస్తూ, “సాధువులను వెర్రి ప్రశ్నలు అడిగితే ఇలాగే ఉంటుంది మరి” అని రాశాడు.మరొకరు మాత్రం “వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించండి.
ప్రతిదీ కంటెంట్ కోసం కాదు” అని అన్నారు.
యూట్యూబర్ అతిగా ప్రవర్తించాడని కొందరు విమర్శిస్తున్నారు.ఒక కామెంట్లో “అతడు హద్దులు మీరాడు.మీరు ఎవరినైనా డిస్టర్బ్ చేస్తే వారు ప్రశాంతంగా ఉంటారని ఎలా ఆశిస్తారు?” అని రాశారు.అయితే మరికొందరు సాధువు అలా స్పందించడం సరికాదని అంటున్నారు.“హింస అనేది పరిష్కారం కాదు.సాధువు మరింత బాగా హ్యాండిల్ చేయాల్సిం.ది” అని ఒక యూజర్ అభిప్రాయపడ్డాడు.
ఇంకొకరు “కంటెంట్ క్రియేటర్లు ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఈ వీడియో చూశాక తప్పక నేర్చుకుంటారు.” అని రాసుకొచ్చారు.