ప్రస్తుత కాలంలో రోజురోజుకు అమ్మాయిలు, మహిళలపై ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.ప్రతిరోజు నిత్యం ఏదో ఒకచోట ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే కొందరు వారిపై జరిగిన అత్యాచారాన్ని కూడా బయటకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.ఈ విధంగా వారిపై జరిగిన అత్యాచార విషయాన్ని బయటకు చెప్పక పోవడానికి గల కారణం వారికి సెక్స్ గురించి అవగాహన లేకపోవడమేనని ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలియజేశారు.
సొంత ఊరు, గంగ పుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్ వట్టి సినిమాలకు దర్శకుడిగా పని చేసిన సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ఇంటర్నేషనల్ ఇష్యూ ఆధారంగా “హనీట్రాప్” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.
ఈ సినిమా ఎంతో మంచి మెసేజ్ ఉన్న సినిమా అని.దీని ఆధారంగా మరో నాలుగు సినిమాలను తెరకెక్కించవచ్చని తెలియజేశారు.
హనీ ట్రాప్ వ్యవహారంలో చిక్కుకుని ఎంతో మంది యువతీ యువకులు ఎలా మోసపోతున్నారనే విషయాలను ఎంతో అద్భుతంగా చూపించబోతున్నామని.ఈ సినిమాలో రొమాన్స్ తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడటంలో ఏమాత్రం తప్పులేదని ఇలా మాట్లాడటం వల్ల పిల్లలకు అవగాహన కలిగి వారిపై జరుగుతున్నటువంటి దాడుల గురించి బయటపెడతారని దర్శకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సెక్స్ గురించి మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని, ఇలాంటి విషయాలను పిల్లలతో తల్లిదండ్రులు చర్చించినప్పుడే వారి జీవితాలు బాగుంటాయని ఈ సందర్భంగా సునీల్ కుమార్ రెడ్డి తెలియజేశారు.భరద్వాజ్ సినీ క్రియేషన్స్పై వి.వి.వామనరావు నిర్మించిన సినిమాలో రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ వంటి వారు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు.