కరోనా వైరస్ గత సంవత్సరన్నర నుంచి ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగిపోతోంది.అతి సూక్ష్మజీవి అయిన కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షలాది మందిని పొట్టన పెట్టుకుని ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ లక్షణాల్లో బాడీ పెయిన్స్ (ఒళ్లు నొప్పులు) ఒకటి.అయితే కొందరికి కరోనా తగ్గినా బాడీ పెయిన్స్ మాత్రం వదలడం లేదు.
ఈ క్రమంలోనే బాడీ పెయిన్స్ నుంచి విముక్తి పొందెందుకు పెయిన్ కిల్లర్స్ను తెగ వాడేస్తున్నారు.
అయితే పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇంట్లోనే సహజంగా బాడీ పెయిన్స్ నివారించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ఒళ్లు నొప్పులను తగ్గించడంలో ఆవ నూనె అద్భుతంగా సహాయపడుతుంది.ఆవ నూనెను శరీరం మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఇలా చేస్తే బాడీ పెయిన్స్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ఒంట్లో కొవ్వును కరిగించడమే కాదు బాడీ పెయిన్స్నూ తగ్గిస్తుంది.ఒక బకెట్ హాట్ వాటర్లో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి బాత్ చేయాలి.ఇలా చేసినా ఒళ్లు నొప్పులు పరార్ అవుతాయి.
వెల్లుల్లి కూడా బాడీ పెయిన్స్ను తగ్గించగలదు.పీల్ తీసిన వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం కలిపి సేవించాలి.రోజుకు ఒక సారి ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక తగినంత మంచి నీరు తాగకపోవడం వల్ల కూడా బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడుతుంటాయి.కాబట్టి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.మరియు డైట్లో పోషకాహరం ఉండేలా చూసుకోవాలి.తద్వారా బాడీ పెయిన్స్ దూరం అవుతాయి.