ప్రపంచం మొత్తం కరోనా వైరస్ అరికట్టేందుకు లాక్డౌన్ ఈ విధానంతో విద్యుత్ బిల్లులను నిలిపి వేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.కానీ ప్రస్తుతం వస్తున్న బిల్లులు చూసి ప్రజలు షాక్ కు గురి అవుతున్నారు.
అసలే కరోనా వైరస్ తో ప్రజలు అతలాకుతలం అవుతూ ఉంటే మరోవైపు విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి.ప్రస్తుతం మాత్రం మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లును ఇవ్వకుండా రెట్టింపు చార్జీలు వస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
అంతే కాకుండా రెండు నెలల రీడింగ్ బిల్లు తీయడంతో ప్రజలు వచ్చిన చార్జీలు చూసి గగ్గోలు పెడుతున్నారు అని చెప్పాలి.అంతేకాకుండా రెండునెలల బిల్లులు ఒకటేసారి తీయడంతో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇటీవల మధ్యప్రదేశ్లో 80 లక్షల కోట్ల బిల్లు రావడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు.ఇక ఈ విషయంలో పూర్తి వివరాలకు వెళ్తే….మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలోని ఓ ఇంటికి 80 లక్షల కోట్ల బిల్లు రావడంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు.
ఆ యజమాని అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
అంతేకాకుండా ఫిర్యాదు చేసినా కూడా సదరు అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని బాధితులు తెలియజేస్తున్నారు.నిజానికి అధికారులు చేసిన తప్పు వలన ఇలా జరిగి ఉంటుందని.కాబట్టే వాళ్లు పట్టించుకోకపోవడం లేదని ఆ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.మరోవైపు చార్జీలు పెద్దగా పెంచక పోయినా కూడా ఏ,బి,సి స్లాబులతో బిల్లును రెట్టింపుగా రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.