దేశంలో కరోనా విజృంభిస్తున్నా కూడా కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంది.ఇతర దేశాల వారితో పోల్చితే మన దేశంలో రికవరీ చాలా స్పీడ్గా ఉందని ఇప్పటికే వైధ్యులు మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
మన ఆహారపు అలవాట్లు మరియు ఇతరత్ర కారణాల వల్ల మనకు ఇమ్యూనిటీ బాగానే ఉంటుందని అంటున్నారు.ఎంతో మంది ప్రముఖులు మరియు సామాన్యులు కూడా ఇప్పటికే కరోనా ను జయించి మళ్లీ సామాన్యమైన జీవితంను సాగిస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కరోనాను జయించారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అమిత్ షా కరోనా బారిన పడ్డట్లుగా రెండు వారాల క్రితం వార్తలు వచ్చాయి.ఆ వెంటనే ఆయన కన్ఫర్మ్ చేశారు.నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.వారం రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా తప్పని సరిగా పరీక్షలు చేయించుకోండి అలాగే స్వీయ నిర్భందంలో ఉండండి అంటూ ప్రకటించాడు.
ఈ విషయాన్ని ఆయన ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాల నుండి పాలక పక్షాల వరకు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థను చేశారు.
ఎలాంటి ప్రమాదం లేకుండా ఆందోళన లేకుండా అమిత్ షా కరోనాను జయించారు.ఆయన విపత్కర పరిస్థితుల్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు.