ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హోంమంత్రి!

కరోనా బారిన పడి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్య కారణాల రీత్యా ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే.అయితే అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న షా ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది.

 Home Minister Amit Shah Discharged From Aiims Hospital, Aiims Hospital, Delhi, A-TeluguStop.com

ఆగష్టు నెల 2 వ తేదీన కరోనా పాజిటివ్ తేలిన అమిత్ షా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రి లో చేరిన విషయం తెలిసిందే.అయితే కొద్దీ రోజుల చికిత్స తరువాత కరోనా ను జయించిన షా ను ఆగష్టు 14 న డిశ్చార్జ్ చేశారు.

అయితే ఆసుపత్రి నుంచి వచ్చిన అనంతరం కూడా షా కొద్దిగా నీరసం తో పాటు ఒళ్ళు నెప్పులు కూడా ఉండడం తో తిరిగి అగష్టు 18 న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.ఇన్ని రోజుల నుంచి చికిత్స పొందిన షా ఆరోగ్యం మెరుగుపడింది అని త్వరలోనే డిశ్చార్జ్ కూడా చేయనున్నట్లు శనివారం ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన కూడా చేశాయి.

ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు (సోమవారం) ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని,అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి మరి డిశ్చార్జ్ చేసినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

కరోనా మహమ్మారి కి పలువురు కేంద్ర మంత్రులు,ప్రజా ప్రతినిధులు ఆసుపత్రుల పాలవుతున్న విషయం విదితమే.మధ్యప్రదేశ్ సీఎం చౌహన్,కేంద్ర మంత్రి లవ్ అగర్వాల్ ఇలా పలువురు మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube