మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇండస్ట్రీలో మొదటి నుంచి ఒక అపవాదు ఉంది.హాలీవుడ్ సినిమా కథలని, సన్నివేశాలని లేపేసి వాటిని యాజటీజ్ గా తన సినిమాలలో పెట్టేస్తాడని విమర్శలు వినిపించాయి.
త్రివిక్రమ్ చేసిన అతడు సినిమా హాలీవుడ్ ఫ్రీమేక్ అని ఇప్పటికి చాలా మంది అంటూ ఉంటారు.అలాగే అత్తారింటికి దారేది సినిమాలో కామెడీ ట్రాక్ మొత్తం హాలీవుడ్ మూవీ నుంచి లేపేసి తీసుకొచ్చాడని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ తో మూడేళ్ళ క్రితం తీసిన అజ్నాతవాసి సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన లార్గోవించ్ మూవీకి ప్రీమేక్ అనే విషయాన్ని అందరూ కనిపెట్టారు.
చివరికి లార్గోవించ్ దర్శకుడు అజ్ఞాతవాసి సినిమా చూసి తన మూవీని కాపీ చేశారని నేరుగా విమర్శలు చేశారు.
అలాగే సినిమాని అంత దారుణంగా తీయడంపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు.
ఈ విషయంలో అప్పట్లో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కంటే ఎక్కువగా పవన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది.తరువాత సాహో సినిమా కథ కూడా తన లార్గో వించ్ కాపీ అంటూ సదరు దర్శకుడు విమర్శలు చేశాడు.
ఇక లార్గో వించ్ రీమేక్ రైట్స్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అప్పటికే సొంతం చేసుకొని ఉండటంతో అజ్ఞాతవాసి టీమ్ పై కేసు కూడా పెట్టింది.తరువాత ఈ కేసు ఏమైంది అనే విషయం ఎవరికి తెలియదు కాని అఫీషియల్ గా ఇప్పుడు లార్గోవించ్ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
విద్యుత్ జమ్వాల్ హీరోగా టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.మరి ఈ ఒరిజినల్ రీమేక్ ఎంత వరకు హిందీలో మెప్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.