హాలీవుడ్ చిత్ర పరిశ్రమకి కరోనా ఎఫెక్ట్ గట్టిగా తగిలింది.ఇప్పటికే కొంత మంది సినీ ప్రముఖులు అక్కడ కరోనా బారిన పడ్డారు.
వారిలో చాలా మంది హాస్పిటల్ లో ఐసోలేషన్ తీసుకుంటున్నారు.నటులు, దర్శకులు, నిర్మాతలు అని తేడా లేకుండా అందరిని కరోనా తాకుతుంది.
ఇక ఈ ఎఫెక్ట్ తో హాలీవుడ్ పూర్తిగా మూతబడింది.ఇక ఐసోలేషన్ తీసుకుంటున్న కొంత మంది నటులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
అయితే తాజాగా హాలీవుడ్ లో మొదటి మరణం కరోనా కారణంగా చోటు చేసుకుంది.
తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
దీంతో గత కొంత కాలంగా హాస్పిటల్ లో అతనికి చికిత్స అందిస్తున్నారు.అయితే కొంత వరకు కోలుకున్నట్లు కనిపించిన కూడా.మరల పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు.ఈ విషయాన్నీ నటి అధికారికంగా ద్రువీకరించింది.
అతని మృతిపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.ఇక హాలీవుడ్ లో కరోనా కారణంగా ఇంకెన్ని మరణాలు చూడాల్సి వస్తుందో అని ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు.