బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి అందరికి తెలిసిందే.బాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో వరుసగా టాప్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించింది.బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
ఆ తర్వాత ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని 2018 రాజస్థాన్ లో పెళ్లి చేసుకుంది.ఈ జంట వివాహం హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది.
దీంతో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా ఒక బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా మొదటిసారి మంగళసూత్రం ధరించినపుడు తన మదిలో మెదిలిన భావాల గురించి చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.నేను మొదటిసారి మంగళసూత్రం ధరించిన సమయం నాకు గుర్తుంది.
ఎందుకంటే మంగళసూత్రం విలువ ఏంటో చెబుతూ పెంచారు.అది నాకు ఎంతో ప్రత్యక్షమైన క్షణం అని తెలిపింది ప్రియాంక.
ఇక అదే సమయంలో, ఒక ఆధునిక మహిళగా మంగళ సూత్రం ధరించడం వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను.అదేవిధంగా మంగళ సూత్రం ధరించడం నాకు నచ్చిందా లేదా లేక అది పితృస్వామ్య వ్యవస్థకీ నిదర్శనమా అన్నది నాకు తెలియదు.
కానీ ఈ వాదన నడుస్తున్న సమయంలో అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉన్నాను.సంప్రదాయాన్ని గౌరవించండి.కానీ మీరు ఎవరు ఏం కావాలో తెలుసుకోండి.అంతేకాకుండా మన తర్వాతి తరం అమ్మాయిలు ఇంకా భిన్నంగా చేయడాన్ని మనం చూస్తాం అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.
అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.ఖచ్చితంగా ఇదో ఒక సంభాషణకి మూలం.
లూసియా సిల్వస్ట్రీ ఎంతో ప్రేమతో, గౌరవంతో రూపొందించిన అందమైన మంగళ సూత్రం ఇది.సంప్రదాయాలను పాటించండి.నేను ప్రయత్నిస్తున్నాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రియాంక చోప్రా.