సినిమా పరిశ్రమ అనేది యూనివర్సల్ రంగం.ఇక్కడ భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడికయినా వెళ్లి నటించవచ్చు.
ఈ గ్రామంలో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ కి అలాగే భారతదేశం నుంచి వెళ్లి అమెరికా హాలీవుడ్ చిత్రాలలో నటించిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి నటించినవాళ్ళ లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ప్రముఖ స్వర్గీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (బ్రతికి ఉన్నప్పుడు), హృతిక్ రోషన్, తదితరులు బాగానే రాణించారు.
కాగా హాలీవుడ్ లో భారతీయ సంతతి నటి “పద్మ పార్వతి లక్ష్మి” కూడా బాగానే రాణిస్తోంది.అయితే పద్మా లక్ష్మి కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడల్ గా, హోస్ట్ గా, రచయితగా, కూడా బాగానే అలరిస్తోంది.
అయితే నటి పద్మా లక్ష్మి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈక్రమంలో అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తోంది.
అయితే తాజాగా పద్మా లక్ష్మి బీచ్ లో బికినీ దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోత నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేకాకుండా 50 ఏళ్ల వయసులో కూడా పద్మా లక్ష్మి తన పరువు అందాలతో మతి పోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి పద్మా లక్ష్మి తల్లిదండ్రులు భారతదేశానికి చెందినవారే.కానీ ఉద్యోగ రీత్యా అమెరికాలో సెటిల్ అయ్యారు.అయినప్పటికీ పద్మా లక్ష్మి మాత్రం భారత దేశపు సాంప్రదాయాలు, అలవాట్లను తూ.చా తప్పకుండా పాటిస్తుంది.కాగా నటి పద్మా లక్ష్మి 2004వ సంవత్సరంలో ప్రముఖ నావలిస్ట్ “సల్మాన్ రుషిదే” ని పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో 2007వ సంవత్సరంలో ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
మళ్లీ అప్పటినుంచి పద్మా లక్ష్మి ఒంటరిగానే ఉంటోంది.