హాకీ ప్రపంచకప్ 2023లో తన గత ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారత జట్టు శుక్రవారం స్పెయిన్తో తలపడుతోంది.భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.17 రోజుల పాటు జరిగే ఈ 15వ హాకీ ప్రపంచకప్లో 16 జట్లు పాల్గొంటున్నాయి.భువనేశ్వర్లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ స్టేడియంలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.పతకం సాధించడమే టీం ఇండియా లక్ష్యం.
48 ఏళ్ల తర్వాత ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో పతకం సాధించాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.1975 నుంచి భారత జట్టు హాకీ ప్రపంచకప్లో రాణించలేకపోతూవస్తోంది.1978 నుండి 2014 వరకు, జట్టు గ్రూప్ దశ దాటి ముందుకు సాగలేకపోతోంది.ఈసారి పతకం సాధించడంలో సఫలమైతే ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన జట్టు ప్రపంచ హాకీపై మళ్లీ ఆధిపత్యం చెలాయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రో లీగ్ మ్యాచ్లలో తొలి మ్యాచ్లో స్పెయిన్ 5-3తో తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్లో భారత్ 5-4తో తేడాతో విజయం సాధించింది.1948 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్తో ఆడిన 30 మ్యాచ్ల్లో 13 మ్యాచుల్లో భారత్ గెలుపొందగా, స్పెయిన్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచ్లు డ్రా అయ్యాయి.2020 ఒలింపిక్స్లో స్పెయిన్పై భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది.భారత జట్టు ఇప్పటి వరకు మూడు పతకాలను దక్కించుకుంది.1971లో ఒక పతకం, 1973లో రెండో పతకం, 1975లో మూడో పతకం సాధించింది.
ప్రపంచంలో 6వ స్థానంలో భారత్ ఈసారి హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో జట్టు పటిష్టమైన స్థితిలో ఉంది.ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా జట్టుపై ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత జట్టు ఇటీవల ఆకట్టుకునే ఆటను ప్రదర్శించింది.కోచ్ గ్రాహం రీడ్ సారధ్యంలో జట్టు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాను ఓ మ్యాచ్లో ఓడించి విజయం దక్కించుకుంది.కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ హర్మన్ప్రీత్ సింగ్ అద్భుతమైన డిఫెండర్, అత్యుత్తమ డ్రాగ్-ఫ్లికర్లలో ఒకరిగా పేరొందారు.
గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్, వెటరన్ మిడ్ఫీల్డర్లు మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, స్ట్రైకర్ మన్దీప్ సింగ్ ఆట గతిని మార్చగల సమర్థులని భావిస్తున్నారు.ప్రపంచకప్లో భారత్ మొత్తం 95 మ్యాచ్లు ఆడింది.
ఇందులో 40 మంది సార్లు విజయం సాధించింది.