ఐపీఎల్ లో ఐదోసారి టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన లో ఉన్నాడు.ఆస్ట్రేలియా దేశంలో జరగబోయే సిరీస్ కొరకు రోహిత్ శర్మ ఓపెనర్ గా ఎంపిక కాకపోవడంతో తాజాగా రోహిత్ శర్మ బెంగళూరు నగరంలోని జాతీయ క్రికెట్ అకాడమీ లో చేరాడు.
పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది.రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంతో ఆయన కాస్త కలత చెంది బెంగళూరు నగరంలో ఉన్న జాతీయ అకాడమీలో చేరాడు.
ఈ సందర్భంగా తాజాగా రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన చుట్టూ ప్రస్తుతం ఏం జరుగుతుందో తనకి అర్థం కావట్లేదని, అలాగే ప్రజలు తన గురించి ఏమి అనుకుంటున్నారో కూడా నాకు తెలియదని ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు ఓ విషయాన్ని తెలిపాడు.
తాను ప్రతి రోజు బిసిసిఐ అలాగే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంతో తాను చర్చలు జరుపుతున్నట్లు అలాగే.ఐపీఎల్ సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో తాను గాయాలకు గురైన సరే ఆ తర్వాత కోలుకున్న తర్వాత సిరీస్ లో పాల్గొని పరుగులు కూడా చేశాను అని చెప్పుకొచ్చాడు.
వీటితో పాటు తాను ప్రస్తుతం కండరాల పట్టివేత నుండి బాగా కోలుకున్నానని త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళేముందు తనలో ఎలాంటి ఇబ్బందులు లేవని సెలక్టర్ల కు తెలియ చేసేందుకు తాను జాతీయ క్రికెట్ అకాడమీ లో చేరినట్లు తెలిపాడు.
ఫిట్నెస్ విషయం మాత్రమే కాకుండా ఇలాంటి విషయాల్లో కూడా తనను వేలెత్తి చూపకుండా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు.తన ఫిట్ నెస్ ను ప్రూవ్ చేసుకున్న తర్వాతనే తాను టెస్ట్ సిరీస్ ఆడతానని తెలియజేశాడు.