రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప అనే చిత్రం రూపొందబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.జనాలు మర్చిపోయినప్పుడు వాటిని ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు తీసుకు వచ్చి ఆ సినిమా గురించి పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు తప్ప సినిమాను మాత్రం పట్టాలు ఎక్కించడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఎట్టకేలకు ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం గురించి అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం వైజాగ్లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ను నిర్మిస్తున్నారట.రాజ ప్రసాదాలు మరియు గోపురాలు.పెద్ద పెద్ద రాజ మహల్స్ సెట్టింగ్స్ను గుణశేఖర్ దగ్గర ఉండి మరి సెట్టింగ్స్ వేయిస్తున్నాడట.
గుణశేఖర్ సెట్టింగ్స్కు పెట్టింది పేరు.తెలుగులో మొదటి కోటి సెట్టింగ్ను వేయించింది గుణశేఖర్ అనే విషయం తెల్సిందే.
అందుకే ఆయన సెట్టింగ్పై జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇప్పుడు హిరణ్య కశ్యప చిత్రం కోసం గుణశేఖర్ వేయిస్తున్న సెట్టింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా గుణశేఖర్ చేస్తున్న రాజ ప్రసాదాలు అద్బుతంగా ఉంటాయంటూ అక్కడ పని చేస్తున్న వారు కొందరు చెబుతున్నారు.సినిమా షూటింగ్ను మరో మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రానా విరాట పర్వం అనే చిత్రంలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత హిరణ్య కశ్యప చిత్రం షూట్లో జాయిన్ అవ్వబోతున్నాడు.