ఈ మధ్యకాలంలో పీరియాడికల్, మైథలాజికల్ కథల మీద టాలీవుడ్ దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసి బోర్ కొట్టిన స్టార్ దర్శకులు ఆ దిశగా తమ ఆలోచనలు మల్లిస్తున్నారు.
ఇక రాజమౌళి అయితే తాను చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్ని కూడా వీలైనంత వరకు పీరియాడికల్ లేదంటే మైథాలజీ టచ్ తోనే తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ జాబితాలో గుణశేఖర్ కూడా ఉన్నారు.
ఎన్నో హిట్ చిత్రాలు తీసిన గుణశేఖర్ చివరిగా రుద్రమ్మదేవి సినిమాతో వచ్చారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దీని తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ హిరణ్యకశిప సినిమా మీద దృష్టి పెట్టారు.దీనిని సురేష్ ప్రొడక్షన్ లో రానా టైటిల్ పాత్రలో తెరకెక్కించాడానికి రంగం సిద్ధం అయ్యింది.
ఇక సురేష్ బాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు.
తాజాగా హిర్యణ్యకశిప ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది.
కరోనా నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారని, బడ్జెట్ తగ్గిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.అయితే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలపడంతో సినిమాపై జరుగుతున్న తప్పుడు ప్రచారంకి ఫుల్ స్టాప్ పడింది.