దాడులు లోకంలో సర్వసాధారణంగా వింటున్న పదం.కానీ పాకిస్దాన్లో మాత్రం ఎక్కడో ఒకచోట నిత్యం జరిగే కార్యక్రమం.
ఈ దేశంలో హిందువుగా పుట్టిన వారు క్షణక్షణం భయపడే ఘటనలు చోటు చేసుకుంటాయి.ఎందుకంటే పూర్తిగా మత వ్యతిరేఖ భావాలు గల దేశం పాకిస్దాన్.
ఇక్కడ ముస్లింలు తప్ప హిందువులంటే అసలు లెక్కలోకి తీసుకోకుండా భాదిస్తారు.ఇక హిందువుల పై జరిగే దాడులకైతే లెక్కేలేదు.
ఇకపోతే తాజాగా పాకిస్థాన్ లో మరో హిందూ కుటుంబంపై దాడి జరిగింది.పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న రహీం యార్ ఖాన్ సిటీలోని అబుధాబి కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతులు కోసి, గొడ్డళ్లతో నరికి కిరాతకంగా చంపారు.
ఇక ఈ హత్యాకాండతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.కాగా ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్దలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలిని ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.