సేవ్ వైఎస్సార్ అంటున్న హిందూపురం కార్యకర్తలు

హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసంతృప్తులు బయటపడుతున్నాయి.అక్కడ పార్టీ ఇంఛార్జిగా ఉన్న ఎమ్యెల్సీ మహ్మద్ ఇక్బల్ పై కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 Hindupuram Ysrcp Leaders On Save Ysr-TeluguStop.com

కార్యకర్తలను పట్టించుకోకుండా ఇక్బాల్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిజమైన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ‘సేవ్ వైఎస్సార్.

నిజమైన వైఎస్సార్ కార్యకర్తలకు న్యాయం జరగాలి’ అనే డిమాండ్‌తో సమావేశం నిర్వహించుకున్నారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలేసి టీడీపీ నుంచి పార్టీ లో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదు అంటూ మండిపడ్డారు.

బాలయ్యను ఎదురించిన వారికి అన్యాయం జరుగుతోందని, కమిషన్లు ఇచ్చేవారికే పనులు చేస్తున్నారని చెప్పారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలుకు కూడా వెళ్లామని, తమ కష్టాన్ని అధిష్టానం గుర్తించి న్యాయం చేయాలని కోరారు.

తమను నిర్లక్ష్యం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని వారు హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube