సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి,వైసీపీ పార్టీ లో చేరి హిందూపురం ఎంపీ గా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన వ్యక్తి గోరంట్ల మాధవ్.ప్రజా ప్రతినిధిగా మారిపోయిన మాధవ్, తన టాలెంట్ ను ప్రదర్శించి వార్తల్లో నిలిచారు.
ఆయన సీఐ గా శిక్షణ తీసుకున్న సమయంలో నేర్పించిన గుర్రపు స్వారీ తో రోడ్డు పై కనిపించి అదరగొట్టారు.సరదాగా గుర్రంపైకి ఎక్కి కొద్ది దూరం స్వారీ చేశారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంపీ మాధవ్ తన నియోజకవర్గంలో గుర్రం స్వారీ చేసుకుంటూ పర్యటించారు.
అక్కడ సుధాకర్ అనే వ్యక్తి గుర్రం కనిపించడంతో, తన శిక్షణ సమయంలో చేసిన రైడింగ్ గుర్తుకు వచ్చింది కాబోలు.ఇక అంతే వెంటనే గుర్రాన్ని తీసుకొని రైడింగ్ మొదలు పెట్టారు.
నల్లపరెడ్డిపల్లి నుంచి నల్లగొండవారి పల్లె వరకు ఎంపీ గుర్రపు స్వారీ చేశారు.ఆయనలా రైడ్ చేస్తుంటే అనుచరులు, స్థానికులు బైక్లపై వెంబడిస్తూ తెగ ఉత్సాహం నింపారు.
అయితే కొందరు స్థానికులు తమ ఫోన్ కెమెరా ల్లో ఈ దృశ్యాలను బందించి సోషల్ మీడియా లో పోస్ట్ లు చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారి పోయింది.ఎంపీగారు సూపర్ అంటూ నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.
కొందరైతే మగధీర సినిమాలో రామ్చరణ్ రేంజ్లో హార్స్ రైడింగ్ చేశారంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కూడా.
.