సీఎం జగన్ కు లేఖ రాసిన బాలయ్య,కారణం!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ ఎమ్మెల్యే,నటుడు బాలకృష్ణ లేఖ రాసినట్లు తెలుస్తుంది.సీఎం తో పాటు సీఎస్ నీలం సాహ్ని లకు బాలకృష్ణ లేఖలు రాశారు.

 Hindupur Mla Balakrishna Wrote Letter To Ap Cm Jagan, Hindupur Mla Balakrishna,a-TeluguStop.com

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో హిందూపూర్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు.హిందూపూర్ పట్టణాన్ని జిల్లా కేంద్రం గా ఏర్పాటు చేస్తే అన్ని నియోజక వర్గాలకు అందుబాటులో ఉంటుంది అని, జిల్లా కు కావాల్సిన అన్ని వసతులు హిందూపూర్ లో ఉన్నాయి అని, అనంతపురం హిందూపురానికి 110 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని ఈ సందర్భంగా బాలయ్య లేఖ ద్వారా గుర్తు చేశారు.

అలానే హిందూ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంజూరైన మెడికల్ కాలేజీ కూడా హిందూపూర్ సమీపంలోని మాల్గుర్ లో ఏర్పాటు చేయాలనీ,దానికి సరిపడా భూమి కూడా ఆ గ్రామంలో అందుబాటులో ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా హిందూపూర్ సమీపంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ నేపథ్యంలో హిందూపూర్ ను ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలి అంటూ కోరారు.

ఏపీ సీఎం,సీఎస్ లతో పాటు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానికి కూడా బాలకృష్ణ లేఖలు రాసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube