కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో విజృంభిస్తుంది.రోజురోజుకూ కేసులు మరింత పెరుగుతున్నాయి.
థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
ఈసారి ఓమిక్రాన్ రూపంలో ముప్పు తప్పదని అర్ధం అవుతూనే ఉంది.
ఇప్పటికే మన టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలో కూడా కరోనా బారిన పడిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు.
రెండు వేవ్ ల కంటే ఈసారి మరింత విజృంబిస్తున్నట్టు కనిపిస్తుంది.ఓమిక్రాన్ పేరుతొ భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.కరోనా బారిన పడిన వారి జాబితా రోజురోజుకు పెరుగుతూ పోతుంది.ఈ క్రమంలోనే హిందీ టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది.
ఆమె తప్ప మిగతా కుటుంబ సభ్యులందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఈ నేపథ్యంలో వైరస్ నుండి రక్షించు కునేందుకు ఆమె 24గంటలు మాస్కులు, శానిటైజేర్స్ వాడుతూ ఉంటుంది.అందుకు తన ముఖం మీద ఎర్రటి మచ్చలే నిదర్శనం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా తెలిపింది.ఆమె పోస్ట్ చేస్తూ.
”ఈ రోజుల్లో జీవితమన్నా.సోషల్ మీడియా అన్నా.ఏదైనా మంచి ఫోటోలు సమకూర్చుకోవడమే.కానీ 2022 కి వచ్చే సరికి పరిస్థితులు 2020 కంటే కూడా క్లిష్టంగా మారిపోయాయి.ఇంట్లో అందరూ కరోనా పాజిటివ్ అని తేలి మీరొక్కరే నెగిటివ్ గా ఉన్నప్పుడు మాస్కులు, శానిటైజర్ తో సన్నద్ధం కావడం తప్ప మరొక మార్గం అనేదే ఉండదు.ఈ క్రమంలో 24 గంటల సేపు మాస్కులు ధరించడం వల్ల మీ ముఖం మీద ఇలాంటి మరకలు తప్పవు మరి.అంటూ ఆమె రాసుకొచ్చింది.ఈ ఫొటోలో ఈమె ముఖం మీద మాస్క్ ధరించడం వల్ల చర్మం కమిలిపోయి ఉంది.