కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా భారత్లోనే ఎక్కువగా ఉంది.దీంతో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
మరోపక్క కరోనా బారిన పడిన రోగులు .ఆక్సిజన్ అందక బెడ్లు కొరతతో అనేక అవస్థలు పడుతున్నారు.ఇలాంటి తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్, 144 సెక్షన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.
ఇలాంటి తరుణంలో తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసులు భారీగా పెరుగుతూ ఉండటం తో .అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 27వ తారీకు నుండి అనగా రేపటి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రా, ఉనా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో కేసులు భారీగా బయటపడుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
.