అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జరగనున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపునుంచీ మళ్ళీ ట్రంప్ నామినేషన్ వేసి పోటీ లో ఉండాలని ముందునుంచీ వ్యూహాలు రచిస్తున్నాడు.
అయితే డెమోక్రాటిక్ పార్టీ తరుపునుంచీ ఇప్పటికే భారత సంతతికి చెందిన కమలా హరీస్, తులసీ గబ్బార్డ్ పోటీ పడుతున్నారు.
అయితే హిల్లరీ తన అభ్యర్ధిత్వాన్ని ఎప్పుడు ప్రకటిస్తారా అని వేచి చూస్తున్న తరుణంలో ఒక్క సారిగా ఆమె సంచలన ప్రకటన చేశారు.ఈ సారి తాను అధ్యక్ష రేసులో లేనని స్పష్టం చేశారు.2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన హిల్లరీ ఈ సారి పోటీ చేసే ఆలోచన లేదని చెప్పారు.
తానూ పోటీలో లేకపోయినా సరే తను నమ్మిన సిద్దాంతాల కోసం పాటు పడతానని భరోసా ఇచ్చారు.తమ పార్టీ నుంచీ పోటీలు పడుతున్న వారితో మాట్లాడానని , అధ్యక్ష రేసులో ఈ సారి డెమోక్రాటిక్ పార్టీదే విజయమని అన్నారు.ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని విమర్శించారు.
తాజా వార్తలు