అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లో జెసి బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న తరహాలో పొలిటికల్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇ మరియు అనుచరులు ఒకానొక టైంలో వెళ్లడం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత తాడిపత్రి స్థానిక సంస్థల ఎన్నికలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి తన సత్తా చాటడం జరిగింది.ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నరు జేసీ ప్రభాకర్ రెడ్డి.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మళ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలింది.నేడు తాడిపత్రి మున్సిపాలిటీ లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్ లను నేరుగా క్యాంపునకు తరలించడం జరిగింది.దీంతో అక్కడి నుండి నేరుగా మున్సిపల్ ఆఫీస్ కి వారిని తీసుకు వచ్చే కార్యక్రమం చేయనున్నట్టు సమాచారం.
చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు రెండూ కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పిన వారికి వచ్చాయి.ఈ క్రమంలో కో -ఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా దాదాపు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన వారికి వచ్చే అవకాశం ఉన్నట్లు అనంతపురం రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.