రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘భారతీయుడు’.ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అవినీతిని అంతం చేసేందుకు కంకణం కట్టుకుని చేసిన పోరాటమే ‘భారతీయుడు’ చిత్రం.
ఆ చిత్రంలో కమల్ హాసన్ అద్బుతమైన పాత్రను పోషించాడు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఇప్పటికి బుల్లి తెరను షేక్ చేస్తూనే ఉంది.
ఆ చిత్రంకు సీక్వెల్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కమల్ హాసన్ కోరుకుంటున్నాడు.
కమల్ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది.శంకర్ ‘భారతీయుడు’ సీక్వెల్ ను ‘ఇండియన్ 2’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.భారీ అంచనాలున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా తాజాగా ప్రారంభం అయ్యాయి.
ఇక ఈ చిత్రంలో కమల్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.కమల్ హాసన్ తో పాటు దుల్కర్ సల్మాన్ మరియు శింబులు ఈ చిత్రంలో కనిపించడం ఖాయం అని తెలుస్తోంది.
భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శంకర్ యువ హీరోల ఎంపికతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు.
తెలుగులో కూడా ‘ఇండియన్ 2’కు భారీ క్రేజ్ ఉన్న కారణంగా తెలుగు యువ హీరోను కూడా ఈ చిత్రంలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మలయాళం నుండి దుల్కర్ ను ఎంపిక చేసిన శంకర్, తెలుగు నుండి కూడా ఒక హీరోను ఎంపిక చేస్తే మార్కెట్ పరంగా కూడా మంచిగా కలిసి వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.మరి శంకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.