అన్యాయం ని ఆపిన హైకోర్టు

విద్యుత్ శాఖకు చెందిన 1,253 మంది ఉద్యోగులకు రెండు తెలుగు ప్రభుత్వాలు చేసిన దారుణమైన అన్యాయాన్ని ఉమ్మడి హైకోర్టు నిలువరించింది.వారి కుటుంబాలు పస్తులు ఉండకుండా కాపాడింది.

 High Court’s Verdict Relieves Power Employees-TeluguStop.com

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ దిస్కంలలో పనిచేసిన వెయ్యి మందికి పైగా ఉద్యోగులను విభజన తరువాత తెలంగాణా సర్కారు తొలగించింది.వీరు ఆంధ్రాకు చెందిన వారు కాబట్టి ఎపీకి వెళ్ళిపోవాలని చెప్పింది.

కానీ ఏపీ ప్రభుత్వం వీరిని తీసుకోవడానికి ఒప్పుకోలేదు.దీంతో ఈ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

ఈ ఏడాది జూన్ నుంచి వీరికి జీతాలు కూడా లేవు.నానా బాధలు పడుతున్న వీరు చివరకు హైకోర్టుకు వెళ్లారు.

తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.ఎట్టకేలకు మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది.

వెయ్యి మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేవిధంగా తీర్పు వచ్చింది.ఈ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తుది తీర్పు వచ్చేవరకు వారిని కొనసాగించాలని చెప్పింది.ఈ ఉద్యోగుల జీతాలను నాలుగు వారాల లోగా ఏపీ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణా ప్రభుత్వం 42 శాతం పెంచాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్ర విభజన తరువాత రాజకేయ నాయకులు బాగు పడ్డారు.కాని అనేక మంది ఉద్యోగులు ఏదో ఒక రకంగా నష్ట పోయారు.

ప్రస్తుతం కొందరికైనా న్యాయం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube