దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాల టైంలో న్యాయస్థానం చాలా సందర్భాలలో సీరియస్ అయిన సంగతి తెలిసిందే.మొదటిలో కరోనా పరీక్షలు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అనేకమార్లు హెచ్చరించడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో
మరోపక్క వ్యాక్సిన్ కొరత ఏర్పడి ఉండడం తో ప్రజల నుండి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే కరోనా కట్టడి విషయంలో తాజాగా తెలంగాణ హైకోర్టు వార్నింగ్ ఇచ్చేటట్లు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
మేటర్ లోకి వెళ్తే కరోనా పరీక్షలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతే కాకుండా కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని.
హై కోర్టు సీరియస్ అయ్యింది.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కూడా సరైన రీతిలో అమలు కావడం లేదని ఈ విషయంపై ఫిర్యాదులు కూడా ప్రజల నుండి వస్తున్నాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది కోర్ట్.
అంతమాత్రమే కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఇంకా అనేక విషయాలలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది.