ఏప్రిల్ 17వ తారీఖున తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఈ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి.
అయితే ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాల నుండి దొంగ ఓటర్లను తీసుకువచ్చి అధికార పార్టీ వైసిపి రిగ్గింగ్ చేసినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో విపక్షాలు వీడియోలతో సహా ఆరోపణలు చేయటం తెలిసిందే.ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అంటూ ఇటీవల ప్రతిపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగాయి.
మళ్లీ తిరుపతి ఉప ఎన్నికలు జరిపించాలని బీజేపీ తిరుపతి అభ్యర్థి రత్నప్రభ పిటిషన్ వేశారు.ఆమె మాత్రమే కాక మరి కొందరు కూడా జరిగిన తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు.తాజాగా హైకోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి జోక్యం చేసుకోలేమని.ప్రతిపక్షాలు వేసిన పిటిషన్లను కొట్టేసింది.ఈ పరిణామంతో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది.
మే రెండవ తారీకున తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితం వెలువడనుంది.
.