ఢిల్లీ క్రేజీ వాల్ ప్రభుత్వం హీరోల భార్యలకు మీ భర్తలను కంట్రోల్ లో పెట్టుకోమని లేఖలు రాసింది.కాగా హీరోల భర్తల కంట్రోల్ తో ప్రభుత్వానికి ఏమి పని అనుకుంటున్నారా.! షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, గోవిందా, అర్బజ్ ఖాన్ ల భార్యలకు ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రభుత్వం లేఖలు రాసిందట.మీ భర్తలు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పాన్ మసాలా గుట్కా వంటి ప్రకటనల్లో నటించకపోతే మంచిది.
అలా నటించకుండా మీరు చూడాలి.అని ఆ లేఖల్లో పేర్కొంది.
ఆ యాడ్స్ లో నటిస్తున్న హీరోలకు ప్రభుత్వం లేఖ రాయాలి గానీ… భార్యలకు లేఖలు రాయడం ఏమిటి అనుకొంటున్నారా.! కానీ ప్రభుత్వం ముందే అలాంటి యాడ్స్ లో నటిస్తున్న హీరోలకు లెటర్స్ రాశారట.
కానీ ఆ లేఖలను ఏ మాత్రం హీరోలు పట్టించుకోలేదట.దీంతో వారి భార్యలకు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లేఖలు రాశారు.
కాగా పాన్ మసాలా యాడ్ లో నటించిన సన్నీ లియోన్ కు అటువంటి యాడ్ లో నటించవద్దని ప్రభుత్వం లేఖ రాసిన వెంటనే నటించడం మానేసింది.కానీ మన హీరోలు అటువంటి లేఖలను పట్టించుకోలేదు.