వైయస్ వివేకా హత్యకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైయస్ వివేకానందరెడ్డినీ … కొంతమంది దుండగులు ఆయన ఇంట్లోనే హతమార్చడం జరిగింది.

 High Court Key Orders To Cbi In Ys Vivekananda Reddy Case, Ys Vivekananda Reddy,-TeluguStop.com

ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉండటంతో వైసిపి నాయకులు ఇది తెలుగుదేశం కుట్ర అని ఆరోపణలు చేశారు.అదే సమయంలో ఎన్నికలలో గెలవడం కోసం జగన్ సొంత బాబాయిని చంపారని… సింపతి సంపాదించుకోవడానికి.

ఈ రకంగా కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు.

అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం తోపాటు వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కేసుకు సంబంధించి హైకోర్టును సీబీఐ ఎంక్వైరీ కోరడంతో.

సీబీఐ వైయస్ వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు వైయస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఇప్పటివరకు వివేకా హత్య కేసుకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలు న్యాయస్థానానికి అందజేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది.ఇదే తరుణంలో ప్రాథమిక అభియోగపత్రం కూడా కోర్టుకు అందించాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అనంతరం తదుపరి విచారణ ఈనెల 20 కి వాయిదా వేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube