ఆ టీడీపీ ఎమ్యెల్యే ఎన్నిక చెల్లదంటూ ... హైకోర్ట్ తీర్పు !

ఏపీ టీడీపీ కి హైకోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది.ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్యెల్యే ఎన్నిక చెల్లనుందంటూ… ప్రతిపక్ష పార్టీ వైసీపీ అప్పటి అభ్యర్థి ఎమ్యెల్యేగా విజయం సాధించినట్టు తీర్పు ఇచ్చింది.వివరాలు పరిశీలిస్తే… అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ప్రస్తుతం ఎమ్యెల్యేగా ఉన్నారు.అయితే… ఆయనపై వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది.

 High Court Judgement On Madakasira Tdp Mla Election-TeluguStop.com

ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.కర్ణాటకలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.దీంతో హైకోర్టు టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటు తాజాగా తీర్పు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube