తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అలర్ట్ అవ్వడం జరిగింది.
పరిస్థితులు ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా హెల్త్ బులిటెన్ ప్రతిరోజు ఇవ్వాలని తాజాగా హైకోర్టు తెలంగాణ సర్కార్ కు సరికొత్త షాక్ ఇచ్చింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి అంటూ హైకోర్టు తెలిపింది.అదేవిధంగా జనం గుంపులు గుంపులుగా తిరగకుండా ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకలో భారీగా కేసులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
.